Champions Trophy-2025 Pakistan VS India Match Tickets : చాంపియన్స్ ట్రోఫీ-2025 లో టీంఇండియా ఆడే మ్యాచ్ టికెట్లను ఐసీసీ ఫిబ్రవరి 3న రిలీజ్ చేసింది. ఈ మెగా టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్ లను దుబాయ్ లో నిర్వహిస్తున్నారు.

ICC Champions Trophy
ICC Champions Trophy | Mega9.in

ఫిబ్రవరి 20న భారత్ తన తొలి మ్యాచ్ లో భాగంగా బంగ్లాదేశ్ తో ఆడనుంది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరు ఫిబ్రవరి 23న జరగనుంది.

చివరి గ్రూపు మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్ తో భారత్ ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్ లకు సంబంధించిన టికెట్లను ఐసీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం జనరల్ స్టాండ్ టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

Champions Trophy Tickets.. జనరల్ టికెట్స్ అందుబాటులోకి

టికెట్ల ధర సుమారు రూ. 3 వేల నుంచి మొదలు కానుంది. ప్రీమియర్, వీఐపీ స్టాండ్ల టికెట్స్ రిలీజ్ కావాల్సి ఉంది. కాగా భారత్, పాకిస్థాన్ మ్యాచులకు టికెట్లకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది.

ఈమేరకు మ్యాచ్ టికెట్లు త్వరగానే అమ్ముడుపోవడం ఖాయంగా కన్పిస్తున్నాయి. మరోవైపు తొలి సెమీస్ తర్వాత ఫైనల్ టికెట్లను ఐసీసీ రిలీజ్ చేయనుంది.

ఈ టోర్నికి సంబంధించిన టికెట్లను చాంపియన్స్ ట్రోఫీ వెబ్ సైట్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

Champions Trophy 2025 : భారత్-పాక్ మ్యాచ్ లు ఎప్పుడంటే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *