Maha Shivaratri Special Buses : మహా శివరాత్రిని పురస్కరించుకొని టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రయాణాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగుకుండా ప్రత్యేకంగా 3వేల బస్సులను నడిపేందుకు సిద్ధమవుతోంది.

తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు మూడువేల స్పెషల్ బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 26న మహా శివరాత్రి కాగా, 24 నుంచి 28 వరకు స్పెషల్ బస్సులను టీజీఎస్ఆర్టీసీ నడపనుంది.
మహా శివరాత్రికి (Maha Shivaratri) 3 వేల స్పెషల్ బస్సులు
- శ్రీశైలానికి 800
- వేములవాడకు 714
- ఏడుపాయలకు 444
- కీసరగుట్టకు 270
- వేలాలకు 171
- కాళేశ్వరానికి 80
- కొమురవెల్లికి 51 బస్సులు
- వీటిపాటు అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప, తదితర ఆలయాలకు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్బీ, బీహెచ్ఎల్ నుంచి శ్రీశైలం పుణ్య క్షేత్రానికి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబా టులో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను 50 శాతం వరకు టికెట్ ధరలను సవరించింది.
కాగా శివరాత్రి ఏర్పాట్లపై ఆర్టీసీ ఉన్న తాధికారులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడకు వెళ్లే ప్రత్యేక బస్సులకు టికెట్ల బుకింగ్ కోసం www.tgsrtcbus.in వెబ్ సైట్లో బుక్ చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. ఈ స్పెషల్ బస్సుల వివరాల కోసం 040-69440000, 040-23450033 నెంబర్లను సంప్రదించాలన్నారు.
Miss World : పోటీల్లో పాల్గొనాలంటే ఉండాల్సిన అర్హతలెంటీ?
Team India : చాంపియన్స్ ట్రోఫీలో భారత్ శుభారంభం