School education into Digital : కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ప్రోత్సహి సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారు. ఈక్రమంలోనే ఏఐ ద్వారా పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పుల దిశగా ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది.

ఇకపై పాఠశాల విద్యను డిజిటల్ మోడ్లోకి మార్చాలని సర్కార్ భావిస్తోంది. ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇంప్రూవ్ చేయడంలో ఏఐ వినియోగించేలా చర్యలు తీసుకుంటోంది.
ఈమేరకు టీచర్లకు అవసరమైన సాంకేతిక వినియోగంపై శిక్షణను ఇప్పించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగా బెంగళూరులోని ఏక్ స్టెప్ ఫౌండేషన్ ను తెలంగాణ విద్యాశాఖ అధికారులు తాజాగా సందర్శించారు.

తొలిదశలో (School Education) పాఠశాల విద్య.. డిజిటల్ మోడ్లోలోకి.. 3,673 స్కూళ్లలో అమలు
తొలిదశలో భాగంగా 3,673 పాఠశాలల్లోని 7,346 తరగతుల్లో తక్షణమే డిజిటల్ స్క్రీన్ ద్వారా బోధన చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ఏదిఏమైనా ప్రభుత్వం ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ప్రాథమిక విద్య నుంచి అమలు చేయనుండటంతో రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Auto Heritage Fest : వీఎన్ఆర్లో.. ఆటో హెరిటేజ్ ఫెస్ట్-2025